మీ భూములు కాటేస్తాడు జాగ్రత్త.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!

-

ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన అమరావతి పనులు చేపట్టి ఐదు కోట్ల ఆంధ్రులని తలెత్తుకుని తిరిగేటట్టు రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని నారా లోకేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం నీరుకొండ ప్రజలతో సమావేశం అయ్యారు. లోకేష్ ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం విలువైన భూములను ఇచ్చిన రైతులకి పై జగన్ కర్కాశంగా వ్యవహరించారన్నారు.

దళిత రైతులకి బేడీలు వేశారన్నారు. మహిళా రైతులని బూటు కాళ్లతో తొక్కించారన్నారు ఎన్ని ఇబ్బందులు పెట్టిన మొక్కవోని ధైర్యంతో ఉద్యమించారు అని అన్నారు. కూటమి రాగానే రైతులకి గత మూడేళ్లుగా చెల్లించాల్సిన కౌలు బకాయిలని వడ్డీతో సైతం చెల్లిస్తామని రాజధాని కూలీలకి 5000 పెన్షన్ ని పెండింగ్ లేకుండా ప్రతినెలా చెల్లిస్తామన్నారు. విశాఖలో భూ కుంభకోణం తప్ప ఒక అభివృద్ధి జరగలేదని అన్నారు. మీ బిడ్డ అని అంటున్నాడు మీ భూములు కొట్టేస్తాడు జాగ్రత్త అని లోకేష్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news