మల్లన్నసాగర్‌ కాదు..ఇది తెలంగాణ జలసాగర్‌: కేసీఆర్​

-

మల్లన్నసాగర్ కాదు ఇది తెలంగాణ సాగర్ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఇవాళ మల్లన్న సాగర్ ప్రాజెక్టు ను సీఎం కేసీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.దేశాన్ని సెట్ రైట్ చేయడానికి జాతీయ రాజకీయాలు లో ముందుకు వెళ్తానని పేర్కొన్నారు.

దేశము దారి తప్పి పోతుందని.. అసహ్యం పుట్టే పనులు దేశంలో జరుగుతున్నాయని చెప్పారు. బెంగళూరు లో జరుగుతున్న మత కల్లోలాలు తో పిల్లలు అక్కడ చదవాలంటే భయపడుతున్నారని.. ఏడేళ్లు గా కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేదని వెల్లడించారు. రాష్ట్రాలు బాగా ఉండాలంటే కేంద్రంలో ధర్మం తో ఉన్న ప్రభుత్వం ఉండాలని.. ప్రజలు కి చేటు అయినది బండ కేసి కొడుతామని హెచ్చరించారు.

దేశానికి మార్గ దర్శనము తెలంగాణ అని.. మహారాష్ట్ర సీఎం మన పథకాలను మెచ్చుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రాజెక్ట్ గురించి కనీస అవగాహన లేని కొన్ని చిల్లర రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తున్నారని.. దేశంలో తక్కువ నిరుద్యోగము ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పరిజ్ఞానం లేని కొందరు వెదవలు మిడ్ మానేరు దగ్గర కట్ట నుంచి నీరు వస్తున్నాయని సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏడేళ్ల కిందట తెలంగాణ పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నించారు సిఎం కెసిఆర్.

Read more RELATED
Recommended to you

Latest news