అమిత్ షాతో కేసీఆర్ భేటీ… ఏం కోరారంటే…

-

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశం అయ్యారు. పార్లమెంట్‌లోని నార్త్ బ్లాక్‌లో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్ద‌రు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు కీల‌క ప్రాజెక్టుల‌కు సంబంధించి కేసీఆర్‌తో అమిత్ షా వ‌ద్ద ప్ర‌స్తావించారు. అమిత్ షాతో స‌మావేశం త‌ర్వాత మోదీతో కేసీఆర్ స‌మావేశం కానున్నారు.

ఇక మోదీతో జ‌రిగే స‌మావేశంలో కేసీఆర్ గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై చర్చిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధానిని పలుమార్లు కోరినప్పటికీ ఇవ్వలేదు. తాజాగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ఉండటంతో ఈ రెండింటిలో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరనున్నారు.

రాష్ట్రంలో హైవేల విస్తరణపై కూడా చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ రింగ్‌రోడ్‌పై ఇప్పటికే డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ మంచినీటి కోసం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చిన తర్వాతే.. కేంద్రం ఘర్‌ఘర్ జల్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర పథకానికి మిషన్ భగీరథను అనుసంధానంచేయాలని సీఎం ప్రధానిని కోరనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news