గవర్నర్ ని కలిసిన సీఎం కేసీఆర్…

-

తెలంగాణ ప్రభుత్వంలో నూతన మంత్రి వర్గ విస్తరణ, ఇతర అంశాలపై చర్చించేందుకు కొద్ది సేపటి క్రితమే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ముఖ్యంగా కొత్త ఎమ్మెల్యేల ప్ర‌మాణ స్వీకారం, స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్‌ల ఎన్నిక గురించి స‌మావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. తిథిఫలితాలను విశ్వసించే ముఖ్యమంత్రి.. అన్ని అనుకూలంగా గల సంక్రాంతి త‌ర్వాతే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌డ‌తామ‌ని గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం నివేదించిన‌ట్లు తెలుస్తోంది.

పలు భావ‌సారూప్య‌త ఉన్న శాఖ‌ల‌న్నింటినీ ఒకే శాఖ‌గా మార్చాల‌ని తాను భావిస్తున్న‌ట్లు కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్‌కు వివరించినట్లు సమాచారం. ఏది ఏమైన కొత్త సంవత్సరంలోనే మంత్రి వర్గ కూర్పు జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version