ప్రజల మధ్యలోకి వస్తారు.. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు కూడా: BRS MLA హరీష్ రావు

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాత్రూంలో కాలు జారిపడిన విషయం తెలిసిందే ఎడమ తుంటికి తీవ్ర గాయం అయినట్లు వైద్యులు చెప్పారు. హిప్ రిప్లేస్మెంటల్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పిన విషయం కూడా మనకి తెలిసిందే. కెసిఆర్ గాయపడిన విషయం తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలని జారీ చేశారు ఆసుపత్రి వద్ద భద్రతా ని పెంచాలని కూడా అధికారులని కోరారు. కెసిఆర్ గాయంపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఇవన్నీ కూడా తెలిసినివే.

ఇప్పుడు తాజాగా త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై కేసీఆర్ ప్రజల మధ్యలోకి వస్తారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో చెప్పారు ఫిబ్రవరిలో తెలంగాణ భవన్ కి వచ్చి ప్రతిరోజు కార్యకర్తలని కలుస్తారని కూడా ఆయన చెప్పారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయని కూడా హరీష్ రావు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కార్యకర్తల మనో భావాలకు అనుగుణంగా పార్టీ నడుస్తుందని కూడా హరీష్ రావు ఈ క్రమంలో చెప్పడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news