విజయనిర్మల బయోపిక్ లో కీర్తి…!

-

మహానటి సినిమా ద్వారా కీర్తి సురేష్ ఏ స్థాయిలో పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటనకు ఫిదా అయిపోయారు తెలుగు తమిళంలో. ఈ రెండు భాషల్లో ఈ సినిమా ఒక రేంజ్ లో ఆడింది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ దాదాపు ఏడాది పాటు సావిత్రి పాత్ర నుంచి బయటకు రాలేదు అంటే ఆ సినిమాలో ఆమె ఏ విధంగా లీనం అయిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత కీర్తికి మంచి ఆఫర్లు వచ్చినా…

ఆమె చాలా జాగ్రత్తగా సినిమాలు చేసింది. ఇప్పుడు మరో బయోపిక్ లో ఆమెకు ఆఫర్ వచ్చింది. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల జీవిత కథ ఆధారంగా ఒక సినిమాను ఆమె కుమారుడు నరేష్ తెరకెక్కిస్తున్నారు అని, అందులో విజయ నిర్మల పాత్ర కీర్తి చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కీర్తి కోసం నరేష్ రెండు నెలల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారని, కథ కూడా సిద్దంగా ఉందని అంటున్నారు.

ఈ బయోపిక్ లో కీర్తి నటిస్తే మూడు కోట్ల పారితోషికం ఇస్తా అని ఆయన చెప్పినట్టు సమాచారం. విజయనిర్మల, హీరోయిన్ గా, నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా కీలక పాత్రలు పోషించారు. సావిత్రి స్థాయిలో కాకపోయినా ఆమె జీవితంలో విజయవంతం అయ్యారు. ఆమెకు ఫాన్స్ ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు ఆ పాత్రను కీర్తి చేస్తే మంచి క్రేజ్ వస్తుందని నరేష్ భావిస్తున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news