టాలీవుడ్ లో కరోనా టెర్రర్.. హీరోయిన్ కీర్తి సురేష్ కు పాజిటివ్

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా మంది సినీ తారలు మరియు ప్రముఖ నటులు కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా… టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గత రెండు రోజుల నుంచి జలుబు తో బాధపడుతున్న హీరోయిన్ కీర్తిసురేష్ తాజాగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

అయితే ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ కీర్తి సురేష్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. “ప్రస్తుతం నేను హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాను. డాక్టర్ల సూచన మేరకు కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నా, నన్ను కలిసిన వారు కరోనా టెస్టు లు చేయించుకోండి. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుని, జాగ్రత్తలు పాటించాలని వినతి. ” అంటూ హీరోయిన్ కీర్తి సురేష్ ట్వీట్ చేసింది. ఈ ప్రకటనతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news