2024 ఎన్నికలు అయ్యాక తెలంగాణకు పారిపోతాడు – కేశినేని నాని

-

2024 ఎన్నికలు అయ్యాక చంద్రబాఉబు తెలంగాణకు పారిపోతాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేశినేని నాని. విజయవాడ క్రిస్తురాజపురం, పెద్ద బావి సెంటర్ లో తూర్పు నియోజకవర్గ జోనల్ ఎన్నికల కార్యాలయం ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, కార్పొరేటర్ లు మరియు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం కేశినేని నాని మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన నాయకుడు అవినాష్ అని కొనియాడారు. లక్ష మందికి రక్షణగా రక్షణ గోడ కట్టించిన గొప్పతనం అవినాష్ దన్నారు.

జగన్ నీ ఒప్పించి వేగవంతంగా రిటైనిoగ్ వాల్ పూర్తి చేశాడు….నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ సొంతమని చెప్పారు. ఫించన్ దారులను ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు. పేదలకు,సామాన్యులకు వైసీపీ ఎమ్మెల్యే,ఎంపీ సీట్లు ఇస్తుంటే చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారు….2024 ఎన్నికలు అయిపోతే సొంత రాష్ట్రం తెలంగాణకు పారిపోతాడని చెప్పారు. శవ రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు… కుట్ర రాజకీయాలు, నీచ రాజకీయాలు కి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అంటూ విమర్శలు చేశారు. ఫించన్లు పంపిణి నిలిపివేసింది చంద్రబాబేనన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news