రైతు బంధు పై రాష్ట్రప్రభుత్వం కీలక ఆదేశాలు

-

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రైతుబంధుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతు బంధు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం పోచారం రైతు యాదగిరి రెడ్డికి వెంచర్లపై ఇచ్చిన రైతుబంధు సొమ్ము రికవరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధుగా తీసుకున్న రూ. 16 లక్షలు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గతంలో 33 ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి యాదగిరిరెడ్డి అమ్మినట్లు ప్రభుత్వం గుర్తించింది. 33 ఎకరాల ప్లాట్ల భూమిపై రూ.16 లక్షల రైతుబంధు చెల్లింపు యాదిగిరిరెడ్డికి జరిగినట్లు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news