కేంద్రంలో విజయసాయిరెడ్డికి కీలక పదవి

-

వైసీపీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి కి కేంద్రంలో కీలక పదవి దక్కింది. పార్లమెంటులో కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎన్నికయ్యారు.

 

అయితే… విజయసాయిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కావడం విశేషం. రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి తో పాటు మరో సభ్యుడిగా భారతీయ జనతా పార్టీకి చెందిన సభ్యులు సుధాంశు త్రివేది కూడా ఎన్నికయ్యారు. ఈ మేరకు వీరిద్దరి ఎన్నికను అధికారికంగా ప్రకటించారు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ శర్మ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ.. కేంద్ర ప్రభుత్వ ఖాతాలను పరిశీలించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇలాంటి పదవీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కి రావడం గమనార్హం. కాగా గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వంలో… వైసీపీ ఎంపీ లకు మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జోరుగా సాగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విజయసాయిరెడ్డికి ఈ పదవిని కట్టబెట్టింది కేంద్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news