గుజరాత్ లో రోడ్డు ప్రమాదం.. ఖమ్మం యువకుడు దుర్మరణం..!

-

రోడ్డు ప్రమాదంలో ఖమ్మం యువకుడు దుర్మరణం పాలైన ఘటన గుజరాత్ రాష్ట్రంలో  చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లాలోని నాయకన్ గూడెంకు చెందిన కంచర్ల సంపత్రెడ్డి (20) అనే యువకుడు గుజరాత్ లో  బీటెక్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సాయంత్రం వేళ స్నేహితుడితో కలిసి సరదాగా బైక్ పై  బయటకు వెళ్తుండగా.. బైకు  అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో సంపత్ రెడ్డి  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అయితే..  అదే బైక్ పై  వెనకాలే ఉన్న స్నేహితుడి కి కూడా తీవ్ర గాయాలు కావడంతో  అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం  కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. సంపత్ రెడ్డి  మరణ వార్త విన్న నాయకన్ గూడెం లో విషాద ఛాయలు అలముకున్నాయి.  అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో సంపత్ రెడ్డి మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు చూసిన వారు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version