దారుణం : వీడియో చేస్తుండగా బాలుడు మృతి.. కిడ్నాప్ డ్రామా !

-

హైదరాబాద్‌ షామీర్‌ పేట్‌లో దారుణం జరిగింది. 15వ తేదీన కిడ్నాప్‌నకు గురైన ఐదేళ్ల బాలుడు శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళ్తే షామీర్‌ పేట్‌లో నివాసముండే ఆటో డ్రైవర్ కుమారుడ్ని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. 15 లక్షలు ఇవ్వాలని.. లేకుంటే చంపేస్తామని ఫోన్ చేసి బెదిరించారు. ఆ రోజే బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తాజాగా ఆ బాలుడు శవమై కనిపించాడు. ఇంట్లో కిరాయికి ఉన్నవాళ్లే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ బయటకొచ్చింది. అదేంటంటే ఆ బాబుతో షేర్ చాట్ లో వీడియో చేస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దాన్ని క్యాష్ చేసుకోవాలనకున్న నిందితుడు, డెడ్ బాడీ పడేసి తిరిగి తల్లితండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో ఈ విషయం బయట కొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news