అభ్యర్థులకు నేరుగా ఫోన్ లు చేసి గుడ్ న్యూస్ చెబుతున్న కిషన్ రెడ్డి !

-

తెలంగాణాలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ జాబితాను సిద్ధం చేయడానికి రాష్ట్రము నుండి కొందరు కీలక నేతలు ఢిల్లీ వెళ్లి అక్కడ పెద్దన్నలతో కలిసి సుదీర్ఘంగా చర్చించి ఫైనల్ చేశారు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్నికలలో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిషన్ రెడ్డి డైరెక్ట్ గా ఫోన్ లు చేసి మీరు సెలెక్ట్ అయ్యారు అంటూ గుడ్ న్యూస్ ను చెబుతున్నారట. ఇప్పటి వరకు ఆ విధంగా రావు పద్మ, ధన్ పాల్ సూర్యనారాయణ, రాణి రుద్రమ, భోగ శ్రావణి, సంగప్ప, యెండల లక్ష్మి నారాయణ లకు కాల్ చేసి చెప్పారట. వీరిలో రాణి రుద్రమ కేటీఆర్ పై పోటీ చేయనున్నారట. ఇంకా మిగిలిన వారు ఏ ప్రాంతాల నుండి పోటీ చేస్తున్నారు అన్నది ఇప్పటికే వారికి తెలియచేసి ఉంటారు.

పూర్తి స్థాయిలో ఇంకా లిస్ట్ ను ప్రకటించలేదని తెలిసిందే. ఇక సర్వే లు అన్నీ కూడా BRS కె అనుకూలంగా ఉండడంతో ఏమి జరగనుంది అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news