ఈటల రాజేందర్ ఓటమి ఖాయం: కేటీఆర్

-

తెలంగాణాలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడానికి ఒకవైపు అధికార పార్టీ BRS, కాంగ్రెస్ మరియు బీజేపీలు పోటీ పడనున్నాయి. ఇక తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ను మా పార్టీ అభ్యర్థులు తప్పక ఓడిస్తారని ధీమాను వ్యక్తం చేశారు కేటీఆర్. ఈటల రాజేందర్ హుజురాబాద్ లో పోటీ చేసినా లేదా గజ్వెల్ లో పోటీ చేసినా లేదా తెలంగాణాలో ఎక్కడ పోటీ చేసినా గెలవడం కష్టమే అని కంఫర్మ్ చేశారు కేటీఆర్. ఇంకా ప్రవల్లిక మరణం గురించి మాట్లాడిన కేటీఆర్, బీజేపీ వీరి చావును రాజకీయంగా వాడుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

ఎవరెన్ని మాట్లాడినా ఇప్పటికే మేము ఆ ఫ్యామిలీకి అండగా ఉంటామని భరోసాను ఇచ్చామంటూ కేటీఆర్ చెప్పారు. ఇక ఈ చావుకు కారణం అయిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కూడా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news