కేసీఆర్ కుటుంబానికి కర్రు కాల్చి వాత పెట్టాలి : కిషన్‌రెడ్డి

-

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. అయితే..
కిషన్ రెడ్డి తో పాటు ప్రచారంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆంక్షకు ఈ మునుగోడు ఎన్నికలు కీలకం. కేసీఆర్ కుటుంబానికి కర్రు కాల్చి వాత పెట్టాలి. రాష్ట్రంలో కుటుంబం పెత్తనం లేకుండా చేయాలంటే రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలి. అనేక మంది తమ ప్రాణాలు త్యాగం చేస్తే , కేసీఆర్ కుటుంబం ఇప్పుడు రాష్ట్రన్ని ఎళుతున్నారు.

Read all Latest Updates on and about G Kishan Reddy

దోచుకున్న డబ్బుతో విమానం కొనే వరకు వెళ్లారు కేసీఆర్. ఇసుక , భూమి , లిక్కర్ వంటి స్కామ్ చేస్తున్నారు. తెలంగాణ మొత్తం దోచుకొని ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి దోచునేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ మొత్తం కేసీఆర్ కుటుంబానికి బానిసగా ఉండాలన్న కోరిక వారికి. నిజాం , రజాకార్ల పాలనను తలపిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ తల్లి కేసీఆర్ కుటుంబం లో బందీగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను తమ పథకాలుగా మారుస్తోంది టీఆర్‌ఎస్‌. ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని ఏకైక ముఖ్యమంత్రి. కల్వకుంట్ల కుటుంబం బందీ నుంచి తెలంగాణ ను విముక్తి చేస్తాం అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news