క్రికెట్ చరిత్రలో 5 గురికే సొంతమైన రికార్డును సాధించిన కోహ్లీ… !

-

ఆసియా కప్ లో భాగంగా ఇండియా మరియు శ్రీలంక ల మధ్యన నిన్న కొలంబోలో జరిగిన మ్యాచ్ లో ఇండియా
41 పరుగుల తేడాతో విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, రాహుల్ , కుల్దీప్ యాదవ్ లో రాణించారు. కాగా ఈ విజయంతో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లలో కలిపి 300 మ్యాచ్ ల విజయాలలో పాలు పంచుకున్న క్రికెటర్ గా కేవలం కొందరికే సొంతం అయిన ఈ రికార్డును అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డును చేరుకున్న క్రికెటర్ లలో ఇండియా నుండి సచిన్ టెండూల్కర్ ఒక్కడే ఉండగా ఇప్పుడు విరాట్ కోహ్లీ జత కలిశాడు.. ఇక పాంటింగ్ (377) అత్యధిక విజయాలలో పాలు పంచుకున్నాడు.

ఆ తర్వాత జయవర్ధనే (336), సచిన్ (307) కలిస్ (305) మరియు సంగక్కర లు ఉన్నారు. ఇప్పుడు కోహ్లీ ఆరవ క్రికెటర్ గా రికార్డు సాధించి వీఅందరి కన్నా వెనక ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news