“సిక్సర్ల కింగ్” రింకూ సింగ్ కు ఇంత అన్యాయమా ?

-

ఐపీఎల్ లో కోలకతా నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగి గత సంవత్సరం ఆఖరి ఓవర్లో వరుసగా అయిదు సిక్సులు కొట్టి జట్టుకు అసాధ్యమైన గెలుపును అందించి ఒక్క నైట్ లో స్టార్ క్రికెటర్ గా మారిపోయాడు. ఆ తర్వాత తన కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆ ప్రదర్శనతో ఇండియా జట్టులోకి రావడం అక్కడ కూడా తన హిట్టింగ్ తో అందరినీ మెప్పిస్తూ చాలా మందికి కొరకరాని కొయ్యలా మారిపోయాడు రింకూ సింగ్. ఇక వచ్చే సంవత్సరం జరగనున్న ఐపీఎల్ సీజన్ కు కోల్కతా లో ఉన్న రింకూ సింగ్ ను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గత ఐపీఎల్ సీజన్ లో రింకూ సింగ్ ను కోల్కతా రూ. 55 లక్షలు చెల్లించింది.. ఇక వచ్చే సంవత్సరం కూడా తన ఫీజు కోటి లోపే ఉండనుందని తెలుస్తోంది. ఈ సమాచారం తెలిసిన రింకు సింగ్ అభిమానులు సోషల్ మొయిద వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మ్యాచ్ విన్నర్ గా మారిన రింకు సింగ్ కు అంతకు మించి చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కోల్కతా ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version