రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే కలెక్టర్ ను కలవండి : సీఎం రేవంత్ రెడ్డి

-

రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే కలెక్టర్ కార్యాలయంలో రైతుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని అక్కడకు వెళ్లి మీ సమస్యను పరిష్కరించుకోండి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తాజాగా గుడిసెల వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రూ.2లక్షలలోపు రైతులకు రుణమాఫీ చేశామని.. రూ.2 లక్షలు దాటిన వారు మిగతా అమౌంట్ చెల్లిస్తే వెంటనే వారికి రూ.2లక్షలు అకౌంట్లలో జమ అవుతాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

రూ.2లక్షలలోపు ఎవరికైనా రుణమాఫీ కాకుంటే కలెక్టర్ కార్యాలయంలో కలవాలని సూచించారు. రైతులకు ఏ సమస్య వచ్చినా కలెక్టర్ ను సంప్రదించాలని సూచించారు. కొందరూ దిక్కుమాళిన వాళ్లు ఇవాళ దీక్ష చేస్తున్నారు. రైతులకు సమస్య ఉంటే దిక్కుమాలిన వాళ్లను కలిస్తే.. పరిష్కారం కాదన్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో పూర్తిగా గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. ఫామ్ హౌస్ లను కాపాడుకునేందుకు కొందరూ పేదలను రెచ్చగొడుతున్నారని పేర్కన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version