కొల్హాపూర్ లో బర్రెలక్క విజయంపై పెరుగుతున్న నమ్మకం…!

-

తెలంగాణాలో మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఎలా ఉన్నా నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం చాలా ప్రత్యేకంగా నిలిచింది అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నుండి స్వాతంత్ర్య అభ్యర్థిగా ఒక డిగ్రీ చదివిన శిరీష అలియాస్ బర్రెలక్క సీనియర్ రాజకీయనాయకులు అయిన జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్) మరియు హర్షవర్ధన్ రెడ్డి (BRS) లపై పోటీ చేస్తోంది. ఇక్కడ బర్రెలక్కకు చాలా మద్దతు పెరిగిందన్న విషయం ఇంకా ప్రత్యర్ధులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా తాను ప్రకటించిన మానిఫెస్టోలో ప్రజలకు మేలు జరిగే అంశాలు ఎక్కువగా ఉండడంతో చాలా మంది ఆమెకు మద్దతుగా నిలబడుతున్నట్లు తేలుతోంది. ఒకవేళ శిరీష అలియాస్ బర్రెలక్క కనుక విజయం సాధిస్తే చరిత్ర అవుతుంది.

విద్యార్థులు, సామాన్యులు ఈమె వెంట నడుస్తున్నారు.. వీరి కుటుంబాలు కనుక ఈమెకు ఓటు వేయగలిగితే గెలుపు అవకాశాలు ఉంటాయి, మరి ఏమి జరగనుందో తెలియాలంటే ఎన్నికలు ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version