ఆ తరవాతే నల్లగొండ లో BRS సభ పెట్టాలి: కోమటిరెడ్డి

-

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బాగా వాడి వేడిగా సాగుతున్నాయి. కృష్ణాజిల్లా అప్పగింతల మీద చర్చ కొనసాగుతోంది. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. జగన్ స్వయంగా వారి అసెంబ్లీ లో తీర్మానం చేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

నల్లగొండలో సభ పెట్టేముందు దీనిపై గులాబీ లీడర్లు వివరణ ఇవ్వాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుతో కొట్టినట్లు జిల్లా లోని మొత్తం 12 స్థానాల్లో ఒక్క చోటే పార్టీ గెలిచిందని ప్రజల విశ్వాసాన్ని బీఆర్ఎస్ కోల్పోయిందని అన్నారు కోమటిరెడ్డి. కెసిఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి కలిసి నల్గొండ జిల్లా కి మోసం చేశారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news