బీజేపీలో చేరడంపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

-

బీజేపీలో చేరడంపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కలిసింది వాస్తవమేనని.. అయితే రాజీనామా, రాజకీయాల గురించి చర్చకు రాలేదని వెల్లడించారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటన చేసినా చేరిక గురించి ఎక్కడా ప్రస్తావించలేదని తేల్చి చెప్పారు.

పార్టీ మారాల్సి వస్తే భువనగిరి, మునుగోడు ప్రజలకు చెప్పి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. కాంగ్రెస్ లో కొందరు నేను గిట్టని వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు… ఉప ఎన్నిక రావాలని నేను కోరుకోవడం లేదని చెప్పారు. రాజీనామా చేయాలని నేను అనుకోవడం లేదని.. గతం లో కాంగ్రెస్ అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల బీజేపీ బలపడే అవకాశం ఉంది అని చెప్పినా అని వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా నేను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ది కి ఓటేశానని..కాంగ్రెస్ అంటే నాకు అభిమానమని పేర్కొన్నారు. అవమానాలు ఎదురైనా..కార్యకర్తల కోసం దిగమింగానని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version