కేసీఆర్ బాధకు కారణం ఏంటో చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

-

మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. చేపలు, గొర్రెల పంపిణీని తాము అపహాస్యం చేయలేదని చేపలు, గొర్రెల పంపిణీ పేరిట రూ.వేల కోట్లు తిన్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు మంత్రి పదవి రాలేదనే తెలంగాణ ఉద్యమం చేపట్టారనీ ,కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉద్యమ సమయంలో అమాయకులను రెచ్చగొట్టి చంపారన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తో భోజనం చేయాలంటే రూ.లక్ష ఇవ్వాలని, తెలంగాణ ప్రజలు సోనియాగాంధీకి రుణపడి ఉండాలని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం సోనియా గాంధీ కాళ్లు మొక్కారన్నారు. జూన్ 4వ తేదీ తర్వాత బీఆర్ఎస్‌లో ఎవరూ ఉండరన్నారు. 70 వేల మంది టీచర్లు రిటైర్ అయినా డీఎస్సీ నిర్వహించలేదని మండిపడ్డారు. పంద్రాగస్టుకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాము. అధికారం పోయి.. బిడ్డలో జైల్లో ఉందని కేసీఆర్ బాధలో ఉన్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news