పోడు భూములపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూటి ప్రశ్న..

-

గిరిజనులకు అటవీ భూములపై అనేక హక్కులు కల్పిస్తామన్నారని, ముఖ్యంగా పోడు భూమలని సాగు చేసుకునే ఆవకాశం కల్పిస్తామన్నారని, వారికి పట్టాలిచ్చి పంటలు పండించుకునేలా చేస్తామన్నారని, అన్నీ చెప్పి ఇప్పుడు మాత్రం మాట మారుస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్నారని అదెంత వరకు కరెక్టో ఆలోచించాలని, పోడు భూములని సాగు చేసుకోవాలని చూసే గిరిజనులపై అక్రమంగా కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

ఈ విషయాలపై కోమటిరెడ్డి వెంకటి రెడ్డి సీఎమ్ కేసీఆర్ కి లేఖ రాసారు. గిరిజనులకి పట్టాలు ఇచ్చే విషయంలో కేంద్రంలో చర్చలు జరుపుతామన్నారు? ఇంకా ఎందుకు జరపలేదు. పోడు భూమల్లో వ్యవసాయం చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మరి ఈ విషయమై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ విషయమై ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news