కేసీఆర్‌.. ఆ రోజే నీ పతనం మొదలైయింది : రాజగోపాల్‌రెడ్డి

-

తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు మేనియా నడుస్తోంది. రాష్ట్ర ప్రజలు ఈ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కేసీఆర్.. తెలంగాణ పోరాటంలో అన్నీ తానై ఉద్యమించిన ఈటల రాజేందర్​ను ఏనాడైతే అవమానించి పంపించావో ఆ రోజే నీ పతనం మొదలైయింది. ఉద్యమకారులను వదిలేసి గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ లాంటి ఉద్యమ ద్రోహులను పక్కనపెట్టుకున్నావ్’ అని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి​ ఫైర్ అయ్యారు. శుక్రవారం రాత్రి నాంపల్లి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్​షాను చూస్తే కేసీఆర్​కు వణుకు పుడుతోందన్నారు. అందుకే తనను ఒక్కడిని ఓడించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి 100 మంది వచ్చారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ మాయమాటలు చెప్పి మోసం చేశారని, రాష్ట్రంలో పేదల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. అందుకోసమే ఈ ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు తనతో కలిసిరావాలని కోరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ సహకరించనందుకే.. నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీ ముందుకు వచ్చానని రాజగోపాల్​రెడ్డి అన్నారు. ఇప్పుడు జరిగే ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నిక అని, వెయ్యి మంది బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ కేవలం కేసీఆర్ కుటుం బం కోసమేనా? అని ప్రశ్నించారు రాజగోపాల్​రెడ్డి. ఎనిమిదేండ్లలో పేదల బతుకులు మారలేదని, ఎవరికీ ఉద్యోగాలు రాలేదని అన్నారు. ఎవరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు రాలేదని, ఉచిత విద్య అమలు కాలేదని అన్నారు రాజగోపాల్​రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు మునుగోడు సమస్యలపై తాను మాట్లాడినా సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. జిల్లా మంత్రికి కల్యాణ లక్ష్మి చెక్కులు పంచడం తప్పితే అభివృద్ధి పనులు చేయడం తెలియదన్నారు రాజగోపాల్​రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version