ఏపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అభద్రతాభావంలో ఉన్నారు – కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

-

మరో 6 నెలల తర్వాత చిత్రవిచిత్రాలు చూస్తారంటూ వైసీపీ ప్రభుత్వంపై కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మరోసారి కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.. మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అభద్రతాభావంలో ఉన్నారు.. ఫోన్లు మాట్లాడుకునే ధైర్యం చేయలేకపోతున్నారని బాంబ్‌ పేల్చాడు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి. విచారణ జరిపితే మిగిలినవారి ట్యాపింగ్ బయటపడుతుందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. సజ్జల నా మిత్రుడికి ఇవ్వాల్సిన స్క్రిప్ట్ సరిగా ఇవ్వలేకపోయారు.. కేంద్రహోంశాఖను విచారణ కోరేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ఆగ్రహించారు. మరో 6 నెలల తర్వాత చిత్రవిచిత్రాలు చూస్తారన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news