ఓటీటీలోకి ‘కళ్యాణం కమనీయం’ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

హిట్..ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ వరుస సినిమాలు చేస్తూ నిత్యం టాక్ ఆఫ్ ది టౌన్​గా నిలుస్తున్నాడు. తాజాగా శోభన్‌ నటించిన కళ్యాణం కమనీయం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య జోరు ఊపందుకోవడంతో ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు.

తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు ముస్తాబవుతోంది. ప్రముఖ ఓటీటీ ఆహాలో ఫిబ్రవరి 17నుండి స్ట్రీమింగ్‌ కానున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. ప్రియ భవాని శంకర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు అనీల్‌కుమార్‌ అల్ల దర్శకత్వం వహించాడు. యూవీ కాన్సెప్ట్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీ డిజిటల్‌ రైట్స్ ద్వారా సేఫ్ అయినట్లు తెలుస్తుంది. కేవలం నాన్‌-థియేట్రికల్‌ హక్కుల ద్వారానే ఈ సినిమాకు దాదాపు రూ.7 కోట్లు ముట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్‌ 5కోట్లలోపే పూర్తయింది.

Read more RELATED
Recommended to you

Latest news