KPHB : పండుగపూట విషాదం..ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

-

విజయదశమి పండుగ వేళ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షంషీగూడలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నది.శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ పడుకున్నాక ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నది. విషయం తెలియడంతో స్థానికులు సుప్రియ తల్లిదండ్రులు, పోలీసులకు వెంటనే సమాచారం అందించారు.

దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె భర్త రఘువేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సుప్రియ ఆత్మహత్య చేసుకునే సమయంలో ఆమె భర్త ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.కాగా, అల్లుడు రఘువేందర్ రెడ్డి, అత్తింటి వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని సుప్రియ తల్లిండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news