మంగళగిరి టీడీపీ కంచుకోటగా మారింది : నారా లోకేష్

-

మంగళగిరిలో వైసీపీ కనుమరుగైందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారిందని తెలిపారు. తాను మంగళగిరిలో ఓడిపోయినా… 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని వివరించారు. టిడిపి అధికారంలోకి రాగానే రాష్ట్రమంతా ఈ నియోజకవర్గ వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు నారా లోకేష్.

మరో 72 రోజుల్లో రాష్ట్రమంతా పసుపు మాయం కాబోతుందని చెప్పారు. ఇన్ని రోజులు అధికార పార్టీ మంగళగిరిని పట్టించుకోకుండా.. ఇప్పుడు మాత్రం ఇండ్ల పట్టాలిస్తామని చెప్పి హడావిడి చేస్తుందని వైసీపీ పై మండిపడ్డారు నారా లోకేష్. గత ఎన్నికల్లో లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి గెలుస్తాడో లేదో వేచి చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news