టీఆర్ఎస్‌ ఆవిర్భావ వేడుకలకు వాళ్లు మాత్రమే రావాలి – కేటీఆర్ ప్రకటన

-

హైటెక్స్ ప్రాంగణంలో జరగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన స్థలాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి కేటీఆర్‌. తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని తెరాస శ్రేణులు పండుగగా జరుపుకుంటారని… 21 ఏళ్లు పూరైనందున హెచ్ ఐసీసీలో ప్రతినిధుల మహాసభను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.

రాష్ట్ర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నామని.. 21వ ఆవిర్భావ దినోత్సవానికి 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. రేపు మధ్యాహ్నం జీహెచ్ఎం నాయకులతో సమావేశం ఉంటుందని.. హెచ్ ఐసీసీ వేదికను ఫైనల్ చేయడం జరిగీందని వెల్లడించారు మంత్రి కేటీఆర్‌.

21 ఏళ్ల తెరాస బాల్యదశ నుంచి మెజార్ గా మారింది రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, నిర్ణయాలు వార్షికోత్సవంలో ఉంటాయన్నారు. ఆహ్వానాలు అందిన వారే ఆవిర్భావ సభకు రావాలని.. సభకు వచ్చే వారికి పాసులు జారీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. 12769 గ్రామ శాఖల అధ్యక్షులు వారి వారి గ్రామాల్లో తెరాస జెండాలు ఆవిష్కరించాలని తెలిపారు. 3600చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలని.. తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్థితత్వానికి ప్రతీకగా తెరాస ఆవిర్భవించిందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news