కేంద్రానికి కేటీఆర్ లేఖ… సింగరేణిని జోలికి వస్తే ఢిల్లీకి మా సెగ తగులుతుందని వార్నింగ్

-

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తోందని.. సింగరేణి జోలికి వస్తే ఢిల్లీకి మా సెగ తగులుతుందని వార్నింగ్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. సింగరేణిలో బొగ్గు బ్లాకులను వేలం వేయవద్దని మంత్రి కేటీఆర్ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రికి లేఖ రాశారు. సింగరేణిలోని నల్ల బంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారం అని.. సింగరేణిని దెబ్బతిస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోలేని విధంగా దెబ్బతినడం ఖాయమని అన్నారు. సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీని తాకుతుందని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఎడేళ్ళ కాలంలో అద్భుతంగా అభివృద్ధి ప్రస్థానంలో ముందుకు పోతుందని..ఇలాంటి సంస్థను ఉద్దేశ్యపూర్వకంగా చంపే కుట్రకు కేంద్రం తెరలేపిందని విమర్శించారు.

సింగరేణిని బలహీనపరిచి, నష్ట పూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందన్నారు. సింగరేణి అంటే కోల్ మైన్ మాత్రమే కాదని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే గోల్డ్ మైన్ అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి దాకా 16 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని.. సింగరేణిని ప్రైవేటకరిస్తే వారసత్వ ఉద్యోగాలు దొరికే అవకాశమే ఉండదని..గనులు మూతపడిన కొద్ది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని అన్నారు. ప్రస్తుతం సింగరేణి కార్మికులకు అందుతున్న హక్కులు, లాభాల్లో వాటా వంటి అన్ని పోతాయని.. అంతిమంగా సింగరేణి సంస్థ సమీప భవిష్యత్తులో కనుమరుగైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.సింగరేణి కాపాడుకునేందుకు మేము అన్ని విధాలుగా సింగరేణి బిడ్డలకు కార్మికులకు అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news