ఎల్లారెడ్డిపేట స్కూల్ బస్సు ప్రమాదంపై మంత్రి కేటీఆర్ ఆరా

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో ఫోన్​లో మాట్లాడి.. విద్యార్థుల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందేలా చూడాలని సూచించారు.

అసలేం జరిగిందంటే.. సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో ఇవాళ ఉదయం స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న బస్సును వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న సుమారు 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు, కొందరు యువకులు గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ స్పందించారు. ప్రమాదానికి గల కారణాలను డీఈవోను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news