ప్రపంచం ఫోకస్ అంతా మన బడ్జెట్​పైనే : ప్రధాని మోదీ

-

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధానమంత్రి మోదీ కోరారు. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పార్లమెంటుకు మోదీ చేరుకొని మీడియాతో మాట్లాడారు.

‘‘విపక్షాలు తమ అభిప్రాయాలు సభలో వ్యక్తపరచాలి. ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోంది. రాష్ట్రపతి, ఆర్థికమంత్రి ఇద్దరూ మహిళలే. భారత్‌ బడ్జెట్‌పై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

కాసేపట్లో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రసంగించనున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆర్థిక సర్వేను సభ ముందుంచనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news