మోదీ కామెంట్స్… తెలంగాణ వ్యాప్తంగా రేపు నిరసనలకు పిలుపునిచ్చి కేటీఆర్

-

పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ రేపు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేయనుంది. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేఖంగా.. రేపు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేయనున్నారు. మండల కేంద్రాలు, నియోజకవర్గాల్లోె బీజేపీ దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. నల్లజెండాలతో ఆందోళనలు చేయాలని శ్రేణులకు సూచించారు.

ఈరోజు రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ… పార్లమెంట్ లో తలుపులు మూసి, మైకులు కట్టేసి తెలంగాణ ఏర్పాటు చేశారన్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ ఇప్పటికే ప్రధాని మోదీ దిష్టిబొమ్మలు తగలబెట్టాలని పిలుపునిచ్చారు. మోదీ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటికీ తెలంగాణ బీజేపీ నుంచి ఎలాంటి కౌంటర్ ఎటాక్ ప్రారంభం కాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version