ఒకే ఓవర్లో రెండు వికెట్లతో విండీస్ ను చావు దెబ్బ కొట్టిన కుల్దీప్ యాదవ్

-

వెస్ట్ ఇండీస్ బ్యాటింగ్ కొనసాగుతోంది, కెప్టెన్ పావెల్ సారధ్యంలో వెస్ట్ ఇండీస్ జట్టు వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించి ఇండియాను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది.. ఆ తర్వాత మ్యాచ్ లో ఇండియా బౌన్స్ బ్యాక్ అయ్యి మ్యాచ్ ను గెలిపించుకుని సిరీస్ ను ఆసక్తికరంగా మార్చింది. ఇక ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో గెలిచిన జట్టుకు సిరీస్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాగా మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ పదికి పైగా రన్ రేట్ తో ఆడుతున్న దశలో 7 వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ మొదటి బంతికే ప్రమాదకర బ్యాట్స్మన్ నికోలస్ పురం ను అవుట్ చేశాడు.. కుల్దీప్ బంతిని తప్పుగా అంచనా వేసిన పురం సూర్యకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అదే ఓవర్ లో కెప్టెన్ పావెల్ ను సైతం అద్భుతమైన బంతితో అవుట్ చేసి ఇండియాను గేమ్ లోకి తీసుకువచ్చాడు.

వీరిద్దరూ అవుట్ కాకుంటే మ్యాచ్ స్వరూపమే మారిపోయేది.. కానీ కుల్దీప్ ఒకే ఓవర్ లలో ఇద్దరినీ అవుట్ చేసి విండీస్ ను చావు దెబ్బ కొట్టాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version