ఆ స్టార్ సింగర్ ఇంట్లో.. కుమారి ఆంటీ వంట మనిషి..?

-

ప్రస్తుతం అందరూ కుమారి ఆంటీ గురించే మాట్లాడుకుంటున్నారు కుమారి ఆంటీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయారు. ఈమె పేరు గత కొన్ని రోజుల నుండి విపరీతంగా మారుమ్రోగిపోతోంది. గుడివాడ నుండి హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడ రోడ్ సైడ్ మధ్యాహ్నం భోజనం అమ్ముతున్నారు. సోషల్ మీడియాలో ఈమె ఫుడ్ స్టాల్ వీడియోలు వైరల్ అవడంతో భారీ సంఖ్యలో అక్కడికి జనం వెళ్లారు. ట్రాఫిక్ జామ్ అవ్వడం కుమారి ఆంటీ మీద సీరియస్ అవ్వడం తర్వాత మళ్లీ అన్ని సర్దుకోవడం ఇవన్నీ కూడా మనం చూసాం.

kumari aunty COMMENTS ON chandrababu

అయితే ఇప్పుడు కుమారి ఆంటీ కి సంబంధించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కుమారి ఆంటీ బిజినెస్ లోకి రాకముందు టాలీవుడ్ సింగర్ హేమచంద్ర ఇంట్లో వంట మనిషిగా చేసేవారట ఆమెకి పిల్లలు పెరిగే కొద్దీ ఖర్చులు ఎక్కువ అవ్వడంతో హైదరాబాద్ని విడిచిపెట్టి సొంత ఊరికి వెళ్ళిపోయారట లాక్ డౌన్ ముందు గుడివాడ వెళ్ళిన ఈమె ఏం చేయాలో తెలియక కొద్దిపాటి భూమిలో కూరగాయల్ని పండించడం మొదలుపెట్టారు తర్వాత లాక్ డౌన్ తీసేసాక హైదరాబాద్ సిటీకి వచ్చి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారట

Read more RELATED
Recommended to you

Latest news