ఏపీది తాలిబన్ ప్రభుత్వం.. .జగన్ రక్తంలోనే ఉంది : కూన రవి

-

మాజీ విప్, టిడిపి జిల్లా అధ్యక్షుడు , కూన రవి కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. 27 నెలల్లో అప్రతిష్ట పాలైన ప్రభుత్వం.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని… ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు… తాలిబన్ ప్రభుత్వమని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్‌ కు రాజ్యాంగ బద్ధమైన హక్కులు లేవని… జగన్ రక్తం లోనే‌ ఉంది మోసం, దగా ఉందని నిప్పులు చెరిగారు.

సూటు కేసు కంపెనీలు ఎలా పెట్టాలి… సూటు కేసు కంపెనీల ద్వారా అవినీతి ఎలా చేయాలి… అవినీతి డబ్బులు ఇతర దేశాలకు ఎలా పంపించాలనే దానిపై జగన్‌ ఫోకస్‌ చేశాడని ఫైర్‌ అయ్యారు. పంపిన సొమ్ము మరలా తన అకౌంట్ లోకి రప్పించుకోవడంలో జగన్ నిష్ణాతుడని తెలిపారు. సూటు కేసు కంపెనీలు ఎలా పెట్టారో… అప్పులు తీసుకు రావడానికి కూడా సూటు కేసు కాంపిటీషన్స్ పెట్టారని ఎద్దేవా చేశారు కూన రవి కుమార్‌.  వచ్చే ఎన్నికల్లో జగన్‌ కు ప్రజలే బుద్ది చెబుతారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news