లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ కోడలు కాబోతుందా…?ఆ వార్తలకు కారణం ఏంటి..!

-

టాలీవుడ్ నటి లావణ్య త్రిపాటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వరుణ్ తన పుట్టినరోజు సందర్భంగా 25 లక్షల విలువ చేసే డైమండ్ రింగ్ పట్టుకొని బెంగళూరులో ఉన్న లావణ్య త్రిపాఠి వద్దకు వెళ్లారంటూ కూడా జోరుగా వార్తలు వినిపించాయి. మరోవైపు త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతోంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

ఓ ఇంటర్వ్యూలో వరుణ్ సోదరి నిహారిక ఇండస్ట్రీ లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటూ ప్రశ్నించగా లావణ్యత్రిపాఠి అని సమాధానమిచ్చింది. అదేవిధంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి రెండు సినిమాల్లో నటించారు. అందులో మిస్టర్ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే లావణ్య త్రిపాఠితో రెండు సినిమాలు చేయడం వల్ల ఏర్పడిన పరిచయం కొంత కాలానికి ప్రేమగా మారింది అంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు లాక్ డౌన్ వేళ నిహారిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

అయితే నిహారిక వివాహానికి కేవలం మెగా ఫ్యామిలీ తో పాటు ఆమె భర్త కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కానీ ఈ వివాహ వేడుకలో నటి లావణ్య త్రిపాఠి సందడి చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా లావణ్య నిహారిక పై అక్షింతలు చదువుతున్న ఫోటో బయటకు వచ్చింది. అదేవిధంగా కేవలం మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఫోటో దిగారు.

అయితే ఆ ఫోటోలో లావణ్య త్రిపాటి ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను అటు వరుణ్ టేజ్ కానీ ఇటు లావణ్య త్రిపాఠి కానీ ఖండించలేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పితే ఈ వార్తలకు చెక్ పడే అవకాశం ఉంది. అంతేకాకుండా లావణ్య త్రిపాఠి మెగా కోడలు అవుతుందా లేదా అన్న దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news