“జై భీమ్” సినతల్లికి ఇల్లు కట్టిస్తా…లారెన్స్ గొప్ప మనసు…!

-

సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం జై భీమ్ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమాను 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. సినిమాలో చిన్న తల్లి ఎదుర్కొన్న కష్టాలను 28 ఏళ్ల క్రితం ఓ మహిళ నిజంగానే అనుభవించింది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన నటుడు దర్శకుడు రాఘవ లారెన్స్ చలించిపోయారు.

అంతేకాకుండా దర్శకుడు లారెన్స్ సినిమా పై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు జ్ఞానవేల్ ను మనసారా అభినందిస్తున్నాను అని చెప్పారు. అలాగే చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజా కన్ను కుటుంబాన్ని ఆదుకుంటామని లారెన్స్ తెలిపారు. అదే విధంగా ఆయన భార్య పార్వతమ్మ (సినతల్లి) కి సొంత ఇల్లు కట్టిస్తా అని లారెన్స్ హామీ ఇచ్చారు. సిన తల్లి పోరాటాన్ని చూసి ఆశ్చర్యపోయా అని చెప్పారు. ఆమెకు తప్పకుండా మంచి ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక లారెన్స్ తీసుకున్న నిర్ణయం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news