తిరుపతిలో చిరుత కలకలం..వ్యక్తి మీద దాడి !

-

సాధారణంగా తిరుమలలో చిరుతల సంచారం గురించి మనం వింటూనే ఉంటాం, కానే మొదటిసారిగా తిరుపతిలో చిరుత పులి కలకలం రేపింది. తిరుపతి జూపార్క్ రోడ్‌లో బైక్‌ మీద వెళుతున్న యువకుడి మీద చిరుత దాడి చేసింది. ఈ నేపథ్యంలో చిరుత దాడి నుంచి తప్పించుకునే క్రమంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతను షాక్ లోకి వెళ్లిపోయాడని తెలుస్తోంది.

మరో పక్క జీవ కోన లోని ఈశ్వరుడి గుడి వద్ద కూడా మరో చిరుత కుక్కను గాయపరించినట్టు సమాచారం. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. చిరుతల్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి తిరుమల ఘాట్‌ రోడ్డులో కూడా కొద్ది రోజుల క్రితం ఒక బైక్ మీద వెళుతున్నవారి మీద దాడి చేసింది. వారిద్దరూ చాకచక్యంగా దాడి నుంచి తప్పించుకోగా స్వల్ప గాయాలు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version