సాంబార్‌లో బ‌ల్లి.. రెస్టారెంట్‌పై కేసు న‌మోదు.. వైర‌ల్ వీడియో..!

-

ఎంతో ఆశ‌గా సాంబార్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేద్దామ‌ని ఆ వ్య‌క్తి అనుకున్నాడు. వెంట‌నే రెస్టారెంట్‌కు వెళ్లి అక్క‌డ ఫుడ్ ఆర్డ‌ర్ చేశాడు. కానీ అందులో వ‌చ్చిన సాంబార్‌ను చూసి షాక‌య్యాడు. అందులో ఓ బ‌ల్లి చ‌చ్చిపోయి క‌నిపించింది. దీంతో అత‌ను ఖంగు తిన్నాడు. వెంట‌నే ఆ రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు. అనంత‌రం ఆ రెస్టారెంట్‌పై ఫిర్యాదు చేశాడు.

lizard in sambar man complained on restaurant

శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ అంటే చాలా ఫేమ‌స్ రెస్టారెంట్‌. 1981లో చెన్నైలో దీన్ని స్థాపించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వీరికి 87 ఔట్‌లెట్లు ఉన్నాయి. మ‌న దేశంలో 39 చోట్ల శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఢిల్లీలో ఉన్న ఆ రెస్టారెంట్‌కు అక్క‌డి పంక‌జ్ అగ‌ర్వాల్ అనే ఓ వ్య‌క్తి బ్రేక్‌ఫాస్ట్ చేసేందుకు వెళ్లాడు. సాంబార్ ఆర్డ‌ర్ ఇచ్చాడు. అందులో చ‌చ్చిపోయిన బ‌ల్లి అత‌నికి క‌నిపించింది. దీంతో అత‌ను షాక‌య్యాడు. వెంట‌నే రెస్టారెంట్ సిబ్బందితో వాదించాడు. ఇంత నిర్ల‌క్ష్యంగా ఉంటే ఎలా అని ప్ర‌శ్నించాడు. వారు సారీ చెప్పారు. అయినా అత‌ను విన‌లేదు, ఆ రెస్టారెంట్‌పై ఫిర్యాదు చేశాడు.

ఈక్ర‌మంలో పోలీసులు ఆ రెస్టారెంట్ నిర్వాహ‌కుల‌పై ఐపీసీ సెక్ష‌న్లు 269, 336 కింద కేసులు న‌మోదు చేశారు. కాగా ఆ స‌మ‌యంలో తీసిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news