బీజేపీ మేనిఫెస్టోలోని 14 కీలక అంశాలు ఇవే

-

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. 14 అంశాలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల ప్రకటించింది. ‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమం నిర్వహించింది. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో మేనిఫెస్టో రూపొందించినట్లు బీజేపీ నేతలు తెలిపారు. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా సంకల్ప్‌ పత్ర రూపొందించామని చెప్పారు. విశ్వబంధు, సురక్షిత భారత్‌, సమృద్ధ భారత్‌, గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ్‌ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్‌ లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించామని బీజేపీ నేతలు తెలిపారు.

14 కీలక అంశాలతో బీజేపీ మేనిఫెస్టో 

1. విశ్వబంధు

2. సురక్షిత భారత్‌

3. సమృద్ధ భారత్‌

4. గ్లోబల్‌ మాన్యూఫ్యాక్చరింగ్‌ హబ్‌

5. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు

6. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌

7. సాంస్కృతిక వికాసం

8. గుడ్‌ గవర్నెన్స్‌

9. స్వస్థ భారత్

10. అత్యుత్తమ శిక్షణ

11. క్రీడావికాసం

12. సంతులిత అభివృద్ధి

13. సాంకేతిక వికాసం

14. సుస్థిర భారత్‌

Read more RELATED
Recommended to you

Latest news