జగన్ ను ఓడించడానికి అన్ని పార్టీలు మాతో కలిసిరావాలి: లోకేష్

-

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం అన్న విషయం టీడీపీ నేతలకు నిదురలేని రాత్రులను గడిపేలా చేసిందని చెప్పాలి. ఈయనను అరెస్ట్ చేస్తారని ఊహించని చాలామంది టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. ఇక లోకేష్ బాలకృష్ణ లు మాత్రమే ఒంటరి పోరాటం చేస్తున్నారు.. ఎలా అయినా చంద్రబాబును బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ లో ఉన్న లోకేష్ టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ మాట్లాడుతూ… చంద్రబాబును అరెస్ట్ చేయడం టీడీపీకి ఒక బ్రేక్ మాత్రమే అని.. ముగింపు కాదని వైసీపీకి సవాలు విసిరారు. రాబోయే ఎన్నికలలో అన్ని అసెంబ్లీ మరియు పార్లమెంట్ సీట్ లను టీడీపీ గెలుచుకుని జగన్ కు ఊహించని షాక్ ని ఇస్తాము అంటూ లోకేష్ ఎంతో నమ్మకంగా మాట్లాడారు.

ఇంకా లోకేష్ మాట్లాడుతూ , టీడీపీ జనసేన లతో కల్సి వచ్చే అన్ని పార్టీలకు మేము స్వాగతం పలుకుతున్నాం అన్నారు.. జగన్ ప్రభుత్వంపై పోరాటం కోసం ప్రతి పార్టీ మాతో కలిసి రావాలని అభ్యర్ధించారు.

Read more RELATED
Recommended to you

Latest news