జగన్ మోహన్ రెడ్డి.. జాదూ రెడ్డి గా మారారు : నారా లోకేష్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై… తెలుగుదేశం పార్టీ యంగ్ లీడర్ నారా లోకేష్ ఎప్పుడు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి సీఎం జగన్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయిన నారాలోకేష్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి.. జాదూ రెడ్డి గా మారారని ఫైర్ అయ్యారు టిడిపి పార్టీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు.

ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారని… అధికారంలోకి వచ్చిన తరువాత జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసి మాట మార్చుడు.. మడమ తిప్పుడు కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని నిప్పులు చెరిగారు నారా లోకేష్. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని సిఎం జగన్ ఫైర్ అయ్యారు. ప్రతి జనవరి ఒకటికి జాబ్ క్యాలెండర్ దేవు డెరుగు ఉన్న కంపెనీలు పోకుండా ఉంటే చాలనుకునే రోజు తెచ్చారు జాదూ రెడ్డి అంటూ ఆగ్రహం వ్య క్తం చేశారు. త్వరలోనే టిడిపి సర్కార్ వస్తుందని పేర్కొన్నారు లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version