తెలంగాణలో అల్లూరి పుట్టి ఉంటే..24 ఎకరాలలో మ్యూజియం ఏర్పాటు చేసేవాళ్ళం : శ్రీనివాస్ గౌడ్

-

ఏపీ భూములపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో 10 ఎకరాలు అమ్మితే.. తెలంగాణ లో 100 ఎకరాలు కొనేవారని.. ఇప్పుడు రివర్స్ అయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ కల్చర్ క్లబ్ లో అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి జాతీయ సంబరాలు ఆవిష్కరణ మహొత్సవం జరిగింది.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజు ఏపీ, తెలంగాణ మంత్రులు ఆవంతి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల లో అల్లూరి ని గుర్తు పట్టని వ్యక్తి ఎవరు ఉండరని.. జాతీయ స్థాయి లో అల్లూరి కి గుర్తింపు రాలేదని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలు పట్ల లేదా తెలుగు రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం కావొచ్చని పేర్కొన్నారు. పార్లమెంట్ లో ఆయన విగ్రహం లేదు, దానికి కిషన్ రెడ్డి సహకరించాలని.. ఏపీ లో రాజులు ఆనందంగా ఉన్నారో లేదో గాని తెలంగాణ లో రాజులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో అల్లూరి పుట్టి ఉంటే 24 సెంట్లు కాదు.. 24 ఎకరాలలో మ్యూజియము ఏర్పాటు చేసే వాళ్ళమని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version