మళ్ళీ పాత జీవితంలోకి తిరిగొచ్చినట్లుంది: రన్ మెషీన్ కోహ్లీ

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వస్తోందంటే క్రికెట్ అభిమానులకి పండగే. ఏడాదికోసారి జరిగే ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈసారి ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.ఇక మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమవుతోంది. ఈక్రమంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆటగళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తాజాగా రన్ మెషీన్ విరాట్ కోహ్లి,

ఆర్సీబీ టీమ్ లో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. ‘ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని అన్నారు. బెంగళూరులో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. రెండు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే మళ్లీ పాత జీవితంలోకి తిరిగి వచ్చినట్లుంది అని తెలిపారు. నా లాగే అభిమానులు కూడా ఐపీఎల్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారనే అనుకుంటున్నా’ అని విరాట్ కోహ్లి చెప్పిన వీడియోను ఆర్సీబీ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news