వైఎస్సార్ కడప జిల్లా సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్నూలు జిల్లా నుంచి కడప జిల్లా మైదుకూరు వైపు వెళుతున్న సిమెంట్ లారీ రహదారి పక్కన ఉన్న డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో లారీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్, క్లీనర్ మంటల దాటికి తట్టుకోలేక సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు సజీవ దహనం..!
-
Previous article
Next article