కాళ్ల పారాని ఆర‌క ముందే..ప్రియుడితో క‌లిసి.. !

-

ప్రియుడితో కలిసి నవ వధువు ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక గ్రామంలో చోటు చేసుకుంది. బాపట్ల రూరల్ ఎస్సై వెంకటప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం…కొండుభట్లవారి పాలెం కు చెందిన ప్రవళిక అనే యువ‌తి మ‌రియు శ్రీకాంత్ అనే యువ‌కుడు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. నెల‌ రోజుల క్రితం మరో యువకుడితో వివాహం చేశారు.

lovers commit suside in andhrapradesh

ఆషాడ మాసం కావడంతో ప్రవళిక తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. శ్రావణమాసం రావడంతో రెండు రోజుల్లో మళ్లీ భర్త ఇంటికి వెళ్లాల్సి ఉంది. కానీ అత్తింటికి వెళ్ల‌డం ఇష్టం లేని యువ‌తి సోమవారం సూర్య‌లంక‌ గ్రామంలో మాజీ ప్రియుడితో కలిసి ప్రవళిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని పొన్నూరు కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version