విశాఖ మెంటల్ హాస్పిటల్ కి పద్మజ దంపతులు !

-

మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పద్మజా, పురుషోత్తం నాయుడు దంపతులను విశాఖ మెంటల్ హాస్పిటల్ కి తరలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇద్దరి మానసిక స్థితి సరిగా లేనందున చికిత్స కోసం అక్కడికి తరలిస్తున్నట్లు చెబుతున్నారు. తమ ఇద్దరు కూతుళ్లను చంపుకున్న ఈ ఇద్దరు దంపతులను కొన్ని రోజులుగా అధికారులు మదనపల్లి సబ్ జైల్లో ఉంచారు.

అయితే రాత్రిపూట పద్మజా వింత చేష్టలు వింత అరుపులతో మిగతా ఖైదీలు అందరూ వణికిపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో శివ శివ అంటూ పద్మజ అరుస్తూ ఉండడంతో ఎప్పుడు ఏమవుతుందో అనే టెన్షన్ తో వారంతా నిద్ర కూడా పోవడం లేదని తెలుస్తోంది. ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో అని ఖైదీలు అందరూ అధికారులకు మొర పెట్టుకోవడంతో చివరికి వీరిని విశాఖ మానసిక చికిత్స కేంద్రానికి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు రేపట్లో వారిని విశాఖపట్నానికి తరలించే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news