పొంగులేటిపై తాత మధు కీలక వ్యాఖ్యలు

-

వైరా నియోజకవర్గంలో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ తాతా మధు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి ఇల్లందులో ఒక మాట, అశ్వారావుపేటలో ఒక మాట మాట్లాడుతున్నాడని.. ఏం మాట్లాడోవొ ఒక సారి పరిశీలించుకొవాలని అన్నారు. ఇల్లందులో, అశ్వారావుపేటలో మాట్లాడిన దానికి సంబందమే లేదన్నారు. పొంగులేటికి స్వంత గ్రామంలో మామిడి తోటకి నీల్లు వస్తున్నాయా లేదా, 108 ఎకరాలకి రైతు బంధు నీ ఎకౌంటు లోకి డబ్బులు రాలేదా..? అని ప్రశ్నించారు.

2014 ముందు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి మర్చిపొయావా? అంటూ నిలదీశారు. నీకు ఇచ్చిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల లో ఎన్ని గెలిపించావని ప్రశ్నించారు. నీకు ఉన్న దుమ్ము తో గెలిపించుకొ లేకపొయావు ఇదా నీ దమ్ము అంటూ నిలదీశారు తాతా మధు. కెసిఆర్ ని ఎదిరించిన విజయశాంతి, నరేంద్ర, వివేక్, ఈటెల లాంటి వారి పరిస్థితి ఏంటని.. నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది గుర్తుంచుకో అంటూ హెచ్చరించారు. అన్ని ఎన్నికల్లో గెలిపించానని అంటున్నావు ఎందరికి వెన్నుపోట్లు పొడిచావొ నీకు తెలియదా..? అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news