పోలీసుల వార్నింగ్ : సుశాంత్ గురించి ఆ ఫోటోలు షేర్ చెయ్యొద్దంటూ.!

-

ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు, ప్రముఖులు ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇది కల అయితే బాగుండు అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ చాలా మంది ఆయనకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇకపై ఆయనకు సంబంధించిన కలవరపరిచే ఫోటోలను షేర్ చెయ్యొద్దంటూ మహారాష్ట్ర సైబర్ పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించిన సైబర్ పోలీసులు అలాంటి ఫొటోలను షేర్ చేయడం చట్టరీత్యా నేరమనీ, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే షేర్ చేసుకున్న ఫోటోలను డిలీట్ చేయాలనీ.. ఇకపై అలాంటి ఫోటోలను షేర్ చేయొద్దని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news